మహానాడు ప్రాంగణంలో నారా లోకేష్ సందడి... కరచాలనం, సెల్పీల కోసం ఎగబడ్డ టిడిపి శ్రేణులు

May 27, 2022, 11:33 AM IST

ఒంగోలు: మహానాడులో పాల్గొనేందుకు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులంతా ప్రకాశం జిల్లా బాటపట్టారు. ఒంగోలు సమీపంలోని మండువవారిపాలెంలో ఇవాళ, రేపు మహానాడు జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టిడిపి నాయకులు ఒక్కోక్కరుగా మహానాడు ప్రాంగణానికి చేరుకుంటున్నారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా మహానాడు ప్రాంగణానికి చేరుకుని సందడి చేసారు. ఆయనను కలిసేందుకు, సెల్ఫీలు దిగేందుకు టిడిపి నాయకులు ఎగబడ్డారు.