Mar 22, 2019, 1:12 PM IST
పీజు రీ ఎంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ శ్రీ విద్యానికేతన్ యజమాని మోహన్ బాబు ఆందోళనకు దిగారు.శుక్రవారం నాడు తిరుపతి-మదనపల్లి రోడ్డుపై బైఠాయించి మోహన్ బాబు నిరసనకు దిగారు. మోహన్బాబుతో పాటు సినీ నటుడు మంచు మనోజ్ కూడ ఈ నిరసనలో పాల్గొన్నారు. ఫీజు రీ ఎంబర్స్మెంట్ బకాయిలను సకాలంలో చెల్లించాలని కోరుతూ మోహన్ బాబు డిమాండ్ చేశారు. నాలుగున్నర ఏళ్లుగా బాబు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు.