అనుమతులిచ్చినా ఇవ్వకపోయినా.. కుప్పంలో ఈనెల 27తేదీ లోకేష్ పాదయాత్ర...

Jan 21, 2023, 7:52 PM IST

విశాఖపట్నం : అనుమతులు ఇచ్చినా ఇవ్వకపోయినా కుప్పం లో ఈనెల 27తేదీ ఉదయం  11 గం లకు లోకేష్ పాదయాత్ర మొదలవుతుందని విశాఖ జిల్లా పార్టీ కార్యాలయం విలేకరుల సమావేశంలో టిడిపి ఉత్తరాంధ్ర ఇన్చార్జ్ బుద్ద వెంకన్న అన్నారు. 
మా టార్గెట్ లోకేష్ అని జగన్ అన్నారు. లోకేష్ మీద దాడులు చేస్తారనే అనుమానాలు వున్నాయి.కేంద్రం జోక్యం చేసుకుని కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు.

పాదయాత్రకు ప్రజలు ఉత్సాహం చూపుతోంటే జీఓ నెంబర్ 1 తో అడ్డుకోవాలని చూస్తున్నారు. పాదయాత్రకు ముందే దరఖాస్తు చేశాం. డిజిపి పర్మిషన్లు ఇవ్వాలి. జీఓ నెంబర్ 1 ని ఉపసంహరించుకోవాలి. పాదయాత్రలకు గతంలో ఏపార్టీకి అనుమతులు ఆపిన దాఖలాలు లేవు‌‌‌‌‌‌‌. జీఓ నెంబర్ 1 పై హైకోర్టు అక్షింతలు వేసినా సుప్రీంకోర్టు కు వెళ్లారు.పాదయాత్ర విజయవంతం అవుతుందనే భయంతో 
జగన్ వున్నారు అని అన్నారు.