బడ్జెట్ లో కాపు కార్పోరేషన్ కు భారీ నిధులు... సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం

Mar 17, 2023, 3:55 PM IST

తాడేపల్లి : ఆంధ్ర ప్రదేశ్ వార్షిక బడ్జెట్ 2023-24 లో కాపుల సంక్షేమానికి రూ.5000 కోట్లు కేటాయించడంపై కాపు కార్పోరేషన్ ఛైర్మన్ ఛైర్మన్ అడపా శేషు హర్షం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసారు శేషు. ఇక జనసేన పార్టీని వీడిన 100మంది కార్యకర్తలకు వైసిపి కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు అడపా శేషు. జనసేన పార్టీకి అండగా నిలిచిన కాపుల కోసం పవన్ కల్యాణ్ ఏం చేసారు? అని ప్రశ్నించారు. జగన్ సర్కార్ చేపడుతున్న ప్రజా సంక్షేమంలో కాపులకే ఎక్కువగా లబ్ది జరుగుతోందని అడపా శేషు పేర్కొన్నారు.