డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య... వైసిపి ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేస్తాం.: ఎస్పీ రవీంద్రనాథ్

May 22, 2022, 10:40 AM IST

కాకినాడ: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును అదుపులోకి తీసుకుంటామని ఎస్పీ రవీంద్రనాథ్ ప్రకటించారు. మృతుడి కుటుంబీకుల స్టేట్‌మెంట్ ఆధారంగా ఎమ్మెల్సీపై ఐపీసీ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసామని ఎస్పీ వెల్లడించారు. ఎమ్మెల్సీ కోసం పోలీస్ బృందాలు గాలిస్తున్నాయని... త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్పీ  రవీంద్రనాథ్ తెలిపారు.