విశాఖకు చేరుకున్న మిడతల దండు?!

May 29, 2020, 11:13 AM IST

విశాఖ జిల్లా, కసింకోట మండలంలో మిడతలు కలకలం రేపుతున్నాయి.  గోకి వాని పాలెంలోని  జీడి  కొమ్మపై  మిడతాలు దండు కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనలో మునిగిపోయారు. ఓ జీడి మామిడి తోటలోకి వచ్చిన దండు క్షణాల్లో మొక్కల ఆకులను తినేశాయి. అయితే ఇవి స్థానికంగా కనిపించే మిడతలేనని భయంలేదని హార్టి కల్చరల్ అధికారులు చెప్పడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.