Oct 17, 2019, 5:15 PM IST
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కల్లూరు మండలం నారాయణపురం లో నిర్వహిస్తున్న"సహస్ర చండీయాగం' చివరి పూర్ణాహుతికి వెడుతూ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తిరువూరు ఎమ్మెల్యే కార్యాలయం దగ్గర కాసేపు ఆగారు. ఆయనకు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి, పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అనంతరం టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే రక్షణనిధి చండియగానికి హాజరయ్యారు.