గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ... నడవలేని స్థితిలో నంద్యాల హాస్పిటల్ కు అమ్మాయిలు

Mar 17, 2023, 10:10 AM IST

నంద్యాల జిల్లా పాణ్యం మండలం నెరవాడ గురుకుల పాఠశాల విద్యార్థులు ఫుడ్ ఫాయిజన్ తో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్లో భోజనం చేసిన తర్వాత విద్యార్థులు తీవ్ర అస్వస్ధతకు గురవడంతో సిబ్బంది హాస్పిటల్ కు తరలించారు. సమయానికి విద్యార్ధులందరినీ నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించడంతో ప్రమాదం తప్పింది. హాస్టల్లో వుండాల్సిన తమ బిడ్డలు హాస్పిటల్లో చేరినట్లు తెలిసి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. తమ బిడ్డల అస్వస్థతకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.