Dec 19, 2019, 10:50 AM IST
అమరావతి రాజధాని గ్రామాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. గురువారం రాజధాని గ్రామాల్లో రాజధాని రైతులు బంద్ ప్రకటించారు. ఏపీ కి మూడు రాజధానులు ఉండొచ్చన్న సీఎం జగన్ ప్రకటన పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. రాజధాని రైతులకు అన్యాయం చేయద్దు అంటూ, ముఖ్యమంత్రి మొండి వైఖరి మారాలి అంటూ నినాదాలు చేస్తున్నారు.