video news : ఎవరినీ అవహేళన చేసేలా మాట్లాడే వ్యక్తిని కాను

Nov 14, 2019, 5:16 PM IST

మన వ్యక్తిగత జీవితాల కన్నా, మనల్ని నమ్ముకుని ఉండే మనుషులు  ముఖ్యం, వారి శ్రేయస్సు కోసం మనం ఎలాంటి అడుగు అయినా తీసుకోక తప్పదు'' అన్న తన నాన్న(దేవినేని నెహ్రూ) మాటలను అనుసరించే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు దేవినేని అవినాశ్ తెలిపారు. తాను ఎవరిని కించపరిచేలా కానీ అవహేళన చేసేలా మాట్లాడే వ్యక్తిని కానని... నమ్ముకున్న వాళ్ళ కోసం కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పోరాడడం తన స్వభావమని అన్నారు.