విశాఖ ఎయిర్ పోర్టులో కరోనా లక్షణాలున్న వ్యక్తి..ఏం చేశాడంటే...

Mar 12, 2020, 3:50 PM IST

సింగపూర్ నుండి విశాఖకు వచ్చిన కుమార్ తనకు కరోనా లక్షణాలున్నాయంటూ ఎయిర్ పోర్ట్ నుండి నేరుగా ఆస్పత్రిలో జాయినయ్యాడు. అప్పలమ్మపాలెంకు చెందిన కుమార్ సింగపూర్ నుండి విశాఖకు వచ్చాడు. అయితే అతనికి అప్పటికే జ్వరం, జలుబు, దగ్గు ఉండడంతో కరోనాలక్షణాలేమో అని అనుమానంతో తనంతట తానే ఎన్టీఆర్ ఏరియా హాస్పిటల్ లోని ఐసోలేషన్ వార్డులో చేరాడు. ఇతనికి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు.