video news : తెలుగుదేశానికి యువరక్తం అవసరం...రాబోయే మూడేళ్లలో యువనాయకత్వం

Nov 14, 2019, 9:46 AM IST

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బుధవారం తన నివాసంలో పార్టీ యువనేతలతో భేటి అయ్యారు. గత ఎన్నికల్లో పార్టీ తరఫున పోటి చేసిన యువ మంత్రులు, ఎమ్మెల్యే అభ్యర్ధులు ఈ భేటికి హాజరయ్యారు. రాబోయే 3ఏళ్లలో 18-35 ఏళ్ల నాయకత్వం తయారు కావాలని దీనికోసం 33% పదవులు 35ఏళ్ల లోపువారికే నని, యువతరంతో పార్టీ మరింత మమేకం కావాలని చంద్రబాబు అన్నారు.