ఏపీ అసెంబ్లీ రగడ: రోడ్డెక్కిన చంద్రబాబు, నిరసన ర్యాలీ (వీడియో)

Jul 25, 2019, 1:02 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తున్న విధానాలను నిరసిస్తూ ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులను అవమానాలకు గురి చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా అమరావతిలో ర్యాలీ చేపట్టారు. సభలో ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు విమర్శించారు.