రేపల్లెలో ఘోరం... మంటలు చెలరేగి రోడ్డుపైనే కారు, బైక్ దగ్దం

Sep 22, 2022, 12:30 PM IST

రోడ్డు ప్రమాదానికి గురయిన కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి బైక్ తో సహా దగ్దమైన ఘటన బాపట్ల జిల్లాలో చోటుచేసుకుంది. రేపల్లె మండలం పేటేరు గ్రామంలో బుధవారం అర్ధరాత్రి కారు అదుపుతప్పి బైక్ ను ఢీకొట్టింది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా మంటలు చెలరేగి రెండు వాహనాలు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే బైక్ వెళుతున్న కట్టుపల్లి విజయ రాజు, రత్నకుమారి గాయపడగా గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.