సకలజనుల సమ్మె : గులాబీలిచ్చి మద్దతు కోరిన రాజధాని రైతులు

సకలజనుల సమ్మె : గులాబీలిచ్చి మద్దతు కోరిన రాజధాని రైతులు

Published : Jan 03, 2020, 12:27 PM IST

అమరావతికి మూడు రాజధానులకు వ్యతిరేకంగా, రాజధానిని అమరావతి నుండి తరలించవద్దంటూ రాజధాని రైతులు చేస్తున్ననిరసనదీక్షలు 17వ రోజుకు చేరుకున్నాయి. 

అమరావతికి మూడు రాజధానులకు వ్యతిరేకంగా, రాజధానిని అమరావతి నుండి తరలించవద్దంటూ రాజధాని రైతులు చేస్తున్ననిరసనదీక్షలు 17వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు నుండి సకలజనుల సమ్మెను తలపెట్టారు. రాజధానిలోని 29 గ్రామాల్లో వ్యాపారులు దుకాణాలను స్వచ్చందంగా మూసివేశారు. తుళ్ళూరులో  రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు. మందడం గ్రామంలో ఆర్టీసీ బస్సులను ఆపి వెనక్కు పంపించారు. అమరావతి మండడంలో పోలీసు వాహనాలు, బస్సులు, ప్రభుత్వ వాహనాలను రైతులు