Jun 27, 2020, 3:16 PM IST
శ్రీకాకుళం జిల్లా పలాసలో 70యేల్ల వృద్ధుడు చనిపోతే కరోనా లక్షణాలు ఉన్నాయని చెప్పి మృతదేహాన్ని ప్రొక్లెయిన్ తో ఈడ్చుకుంటు వెళ్లిన సంఘటన కలకలం రేపింది. దీనిమీద ఏపీ ముఖ్యమంత్రి జగన్.. ఈ సంఘటన తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని మానవత్వాన్ని చూపాల్సిన సమయంలో కొంతమంది వ్యవహరించిన తీరు బాధించింది. ఇలాంటి ఘటనలు మరెక్కడా పునరావృతం కాకూడదు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకతప్పదు అని ట్విట్టవర్ వేదికగా స్పందించారు. ఈ ఘటనలో మున్సిపల్ కమిషనర్, శానిటరీ ఇన్స్పెక్టర్పై సస్పెన్షన్ వేటు పడింది.