వేములవాడలో ఇండోనేషియా వాసులు...19 మందిపై కేసు: ఎస్సై రఫీక్

Arun Kumar P   | Asianet News
Published : Apr 24, 2020, 07:22 PM ISTUpdated : Apr 24, 2020, 07:35 PM IST
వేములవాడలో ఇండోనేషియా వాసులు...19 మందిపై కేసు: ఎస్సై రఫీక్

సారాంశం

వేములవాడలో గుర్తించిన 12మంది ఇండోనేషియా వాసులపై కేసులు నమోదు చేసినట్లు వేములవాడ ఎస్సై తెలిపారు. 

కరీంనగర్: గత నెలలో ఇండోనేషియా నుండి వేములవాడ కు వచ్చిన విదేశీయులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రఫీక్ ఖాన్ తెలిపారు. ఇలా  12మంది  విదేశీయులపైనే కాకుండా వారికి సహకరించిన 7గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. మొత్తంగా 19మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ పట్టణంలో ఇప్పటికే కరోనా కేసులు బయటపడ్డాయి. డిల్లీలో జరిగిన మర్కాజ్ ప్రార్థనలకు హాజరైన వేములవాడకు చెందిన నలుగురు యువకులకు కరోనా పరీక్షలు నిర్వహించారు జిల్లా వైద్యాదికారులు. వీరిలో ఓ యువకుడికి కరోనా పాజిటివ్ తేలడంతో అతన్ని హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటలకు తరలించారు. 

ఈ క్రమంలోనే ఇండోనేషియాకు చెందిన ఏడుగురు వేములవాడలో పర్యటించినట్లు వైద్యాధికారులు, పోలీసులు గుర్తించారు. కొందరు స్థానికుల సహకారంతో వారు వేములవాడలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించినట్లు గుర్తించారు. దీంతో 12మంది ఇండోనేషియా వాసులతో పాటు ఏడుగురు స్థానికులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రఫీక్ వెల్లడించారు. 

తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 13 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్ -19 కేసుల సంఖ్య రాష్ట్రంలో 983కు చేరుకుంది.ఇప్పటి వరకు 291 మంది కోలుకుని ఆస్పత్రు నుంచి డిశ్చార్జీ అయ్యారు. యాక్టివ్ కేసులు 663 ఉన్నట్లు తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. ఇప్పటి వరకు 25 మంది మరణించినట్లు ఆయన తెలిపారు.

  

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech: విద్యా అభివృద్ధికి రూ. 26,600 కోట్లు సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్
Governor Shiv Pratap Shukla Speech: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సూపర్ స్పీచ్