విషాదం... మాజీ ఎమ్మెల్యే మాచర్ల జగన్నాథం గౌడ్ మృతి

Arun Kumar P   | Asianet News
Published : Apr 30, 2021, 01:26 PM ISTUpdated : Apr 30, 2021, 01:43 PM IST
విషాదం... మాజీ ఎమ్మెల్యే మాచర్ల జగన్నాథం గౌడ్ మృతి

సారాంశం

గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే జగన్నాథం గౌడ్ కన్నూమూశారు. 

హైదరాబాద్‌: ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే మాచర్ల జగన్నాథం గౌడ్ కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందారు జగన్నాథం గౌడ్. ఈ క్రమంలో ఇవాళ(శుక్రవారం) ఆయన ఆరోగ్యం మరింత క్షీణించి మృతి చెందారు.  జగన్నాథం గౌడ్ మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు.  వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఇక జగన్నాథం గౌడ్ మృతి పట్ల ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కూడా జగన్నాథం కుటుంబానికి ప్రగాడ సానుభూతి ప్రకటించారు. ఆయన మరణంతో వరంగల్ జిల్లా మంచి నాయకున్ని కోల్పోయిందని ఆవేధన వ్యక్తం చేశారు. 


 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !