ములుగు జిల్లాలో ఎన్‌కౌంటర్: ఇద్దరు మావోలు హతం

By Siva KodatiFirst Published Oct 18, 2020, 4:45 PM IST
Highlights

తెలంగాణలో మావోయిస్టులకు మరో దెబ్బ తగిలింది. ములుగు జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోలు హతమయ్యారు. నర్సింహసాగర్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తోన్న స్పెషల్ పార్టీ పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి

తెలంగాణలో మావోయిస్టులకు మరో దెబ్బ తగిలింది. ములుగు జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోలు హతమయ్యారు.

నర్సింహసాగర్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తోన్న స్పెషల్ పార్టీ పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.  

ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మృతులను ఇటీవల టీఆర్‌ఎస్‌ నేత భీమేశ్వరావును హతమార్చిన మావోయిస్టులుగా గుర్తించారు.

కాగా, ఈ నెల 10న అర్ధరాత్రి సమయంలో మావోయిస్టులు ములుగు జిల్లా వెంకటాపురంలో టీఆర్ఎస్ నేత భీమేశ్వర రావుని అర్ధ రాత్రి బయటకు లాక్కొచ్చి చంపిన విషయం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇన్‌ఫార్మరనే నెపంతో మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు

click me!