టీఆర్ఎస్ సింగిల్ డిజిట్ కే పరిమితం.. ఎల్.రమణ

Published : Nov 12, 2018, 04:20 PM IST
టీఆర్ఎస్ సింగిల్ డిజిట్ కే పరిమితం.. ఎల్.రమణ

సారాంశం

తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుందని టీటీడీపీ నేత ఎల్. రమణ అభిప్రాయపడ్డారు.

తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుందని టీటీడీపీ నేత ఎల్. రమణ అభిప్రాయపడ్డారు. ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన కేసీఆర్ పై మండిపడ్డారు. ఎన్నికల షెడ్యుల్ రాకముందే.. కేసీఆర్ రూ.వందల కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు.

అధికారంలోకివచ్చి కేసీఆర్ కుటుంబం ఆస్తులను పెంచుకుందని విమర్శించారు. ఆ ఆస్తుల వివరాలన్నింటినీ.. ప్రజల ముందుకు తీసుకువస్తానని ఆయన అన్నారు. మహాకూటమిలో అసంతృప్తి నేతలను తమ పార్టీవైపు తిప్పుకుంటామని కేసీఆర్ చేసిన మాటలు సిగ్గుచేటుగా ఉన్నాయన్నారు.

మహాకూటమి గెలుపుకోసం తాను, రావుల.. ఈ ఎన్నికలకు దూరంగా ఉంటున్నామన్నారు. తమ మహా కూటమి  అధికారంలోకి రాగానే.. ప్రగతి భవన్ ను హాస్పిటల్ గా మారుస్తామన్నారు. మంగళవారం ఒకే వేదికపై మహాకూటమి అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Viral Video : చేతిలో టీ గ్లాస్ పట్టుకుని పగలబడి నవ్వే... ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
IRCTC: బిజీ లైఫ్‌కి కాస్త బ్రేక్ ఇవ్వండి బాస్‌.. త‌క్కువ ధ‌ర‌లో థాయ్‌లాండ్ టూర్‌, లైఫ్ టైమ్ మెమోరీస్ ఖాయం