కారెక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రజా వ్యతిరేకత: భద్రత పెంపు

By Siva KodatiFirst Published Jun 14, 2019, 3:48 PM IST
Highlights

తెలంగాణలో ఇద్దరు శాసనసభ్యులకు ప్రభుత్వం భద్రతను పెంచింది. కాంగ్రెస్ టికెట్‌పై గెలిచి ఇటీవల టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్థన్ రెడ్డిలు వారి నియోజకవర్గాల్లో తీవ్ర స్థాయిలో ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.

తెలంగాణలో ఇద్దరు శాసనసభ్యులకు ప్రభుత్వం భద్రతను పెంచింది. కాంగ్రెస్ టికెట్‌పై గెలిచి ఇటీవల టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్థన్ రెడ్డిలు వారి నియోజకవర్గాల్లో తీవ్ర స్థాయిలో ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.

ఈ క్రమంలో తమకు భద్రతను పెంచాల్సందిగా ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కోరారు. వీరి విజ్ఞప్తిని పరిగణనలోనికి తీసుకున్న ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అధికారులు ఇద్దరికి 4+4 గన్‌మెన్‌లను కేటాయించారు. 

click me!