జగిత్యాలలో జీవన్ రెడ్డి వెనుకంజ

By ramya neerukondaFirst Published Dec 11, 2018, 8:43 AM IST
Highlights

 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కొనసాగుతోంది. కాగా.. రెండు స్తానాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కొనసాగుతోంది. కాగా.. పలు స్తానాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. సూర్యాపేట  మొదటి రౌండ్ లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది.  జగిత్యాలలో టీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ ఆధిక్యంలో దూసుకెళుతున్నారు.

జగిత్యాల కూటమి అభ్యర్థి జీవన్ రెడ్డి.. తానే గెలుస్తానని ధీమాతో ఉన్నారు. కానీ.. ఇక్కడ ఫలితాలు మాత్రం తేడాగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 7వ తేదీన జరిగిన పోలింగ్‌ ఫలితాలు మరికొద్దిసేపట్లో వెల్లడి కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1821 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు విధుల్లో సుమారు 40వేలకు పైగా సిబ్బంది ఉన్నారు

click me!