టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్‌ యాదవ్‌కు కరోనా.. ఐసీయూలో చికిత్స

Siva Kodati |  
Published : Aug 31, 2021, 05:01 PM IST
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్‌ యాదవ్‌కు కరోనా.. ఐసీయూలో చికిత్స

సారాంశం

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో ఆయన జూబ్లిహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఐసియూలో చికిత్స పొందుతున్నారు. ఆయనను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. 

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో ఆయన జూబ్లిహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఐసియూలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ దీక్షలో పాల్గొన్నారు అంజన్ కుమార్ యాదవ్. ఆ తర్వాతే ఆయనకు కోవిడ్ సోకినట్లుగా తెలుస్తోంది. జూబ్లిహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స  పొందుతున్న అంజన్ కుమార్ యాదవ్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. 

PREV
click me!

Recommended Stories

Rain Alert : రుతుపవనాలు వచ్చేస్తున్నాయి... తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు
Bullet Train: హైదరాబాద్ టు అమరావతి కేవలం 70 నిమిషాలే ! బుల్లెట్ ట్రైన్ రూట్ మ్యాప్ ఇదే !