తండ్రి మందలించాడని పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య..!!

By AN TeluguFirst Published Oct 4, 2021, 11:27 AM IST
Highlights

రాత్రి పగలు తేడా లేకుండా మొబైల్ ఫోన్ లో గేమ్స్ ఆడుతుండడంతో విసుగుచెందిన తండ్రి మందలించడంతో ఆ విద్యార్తి మనస్తాపానికి గురయ్యాడు. 

రంగారెడ్డి జిల్లా మీర్ పేట్ పీఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఇక్కడి సర్వోదయ నగర్ లో జరిగిన విషాద ఘటన అందరినీ కలచి వేసింది. తండ్రి మందలించాడని ఓ పదో తరగతి విద్యార్థి (10th Class Student)క్షణికావేశంలో ఆత్మహత్యకు (Suicide) పాల్పడ్డాడు. 

రాత్రి పగలు తేడా లేకుండా మొబైల్ ఫోన్ లో గేమ్స్ ఆడుతుండడంతో విసుగుచెందిన తండ్రి మందలించడంతో ఆ విద్యార్తి మనస్తాపానికి గురయ్యాడు. అది మంచిది కాదని, రాత్రి చాలా పొద్దుపోయిందని తండ్రి మందలించాడు. దీంతో ఆ విద్యార్థి దాన్ని తట్టుకోలేకపోయాడు. మనోవేదనకు గురయ్యాడు. తండ్రి పడుకున్న తరువాత ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. 
 

click me!