జీహెచ్ఎంసీలో ఆగని కరోనా జోరు:తెలంగాణలో మొత్తం 54,059కి చేరిక

Published : Jul 26, 2020, 12:20 PM IST
జీహెచ్ఎంసీలో ఆగని కరోనా జోరు:తెలంగాణలో మొత్తం 54,059కి చేరిక

సారాంశం

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. 24 గంటల్లో 1593 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య  54,059కి చేరుకొన్నాయి.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. 24 గంటల్లో 1593 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య  54,059కి చేరుకొన్నాయి.

గత 24 గంటల్లో 998 మంది కరోనా నుండి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 41,332 మంది కరోనా నుండి కోలుకొన్నారు. అంతేకాదు ఒక్క రోజులో 8మంది మరణించారు. రాష్ట్రంలో 463 మంది కరోనాతో మరణించినట్టుగా ప్రభుత్వం తెలిపింది.కరోనాతో మరణించిన డెత్ రేట 2.3గా ఉంది. రాష్ట్రంలో ఇంకా 12,264 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

also read:ఉత్తరకొరియాలో కరోనా తొలికేసు నమోదు: కేసాంగ్‌లో లాక్‌డౌన్ విధింపు

ఇప్పటివరకు రాష్ట్రంలో 3,53,425 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.గత 24 గంటల్లో 54,059 మందికి టెస్టులు నిర్వహిస్తే 1593 మందికి కరోనా సోకిందని తేలింది.

జిల్లాల వారీగా కరోనా కేసులు
ఆదిలాబాద్-14
భద్రాద్రి కొత్తగూడెం-17
జీహెచ్ఎంసీ -641
జగిత్యాల-02
జనగామ-21
జయశంకర్ భూపాలపల్లి-03
జోగులాంబ గద్వాల -05
ఖామారెడ్డి-36
కరీంనగర్-51
ఖమ్మం-18
కొమరంభీమ్-0
మహబూబ్‌నగర్-38
మంచిర్యాల-27
మెదక్-21
మేడ్చల్ మల్కాజిగిరి-91
ములుగు-12
నాగర్‌కర్నూల్-46
నల్గొండ-06
నారాయణపేట-07
నిర్మల్-01
నిజామాబాద్-32
పెద్దపల్లి-16
రాజన్న సిరిసిల్ల-27
రంగారెడ్డి-171
సంగారెడ్డి-61
సిద్దిపేట-05
సూర్యాపేట-22
వికారాబాద్-09
వనపర్తి-01
వరంగల్ రూరల్-21
వనపర్తి అర్బన్-131
యాదాద్రి భువనగిరి-11

PREV
click me!

Recommended Stories

నేషనల్ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రెస్ మీట్ | Telangana CM Revanth Reddy Pressmeet
నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు | Asianet News Telugu