ముందస్తు ఎఫెక్ట్: ఇతర పార్టీలతో పొత్తుల కోసం టిపిసిసి కమిటీ

Published : Sep 07, 2018, 08:12 PM ISTUpdated : Sep 09, 2018, 02:13 PM IST
ముందస్తు ఎఫెక్ట్: ఇతర పార్టీలతో పొత్తుల కోసం టిపిసిసి కమిటీ

సారాంశం

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతూ తమ అభ్యర్ధులను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. కేసీఆర్ దూకుడును చూసి ప్రతిపక్షాలు కూడా దూకుడును పెంచాయి. ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ కూడా ఇతర పార్టీలతో పొత్తులపై చర్చించేందుకు ఓ కమిటీని నియమించింది. 

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతూ తమ అభ్యర్ధులను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. కేసీఆర్ దూకుడును చూసి ప్రతిపక్షాలు కూడా దూకుడును పెంచాయి. ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ కూడా ఇతర పార్టీలతో పొత్తులపై చర్చించేందుకు ఓ కమిటీని నియమించింది. 

టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో పిసిసి పొత్తుల కమిటీ నియామకం జరిగింది. ఈ కమిటీ కాంగ్రెస్ కలిసి ఎన్నికల బరిలోకి దిగేందుకు ఇష్టపడుతున్న పార్టీలను మిత్రపక్షాలుగా మలుచుకునేందుకు చర్చలు జరపనుంది. రెండ్రోజుల్లో ఈ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఏయే పార్టీలతో పొత్తు పెట్టుకోవచ్చు, పొత్తుల వల్ల లాభాలేమిటి వంటి విషయాలను చర్చించనున్నారు. దీని తర్వాతే ఈ కమిటీ ఏకాభిప్రాయంతో ఇతర పార్టీలతో చర్చలు జరిపి పొత్తులు కుదుర్చుకోనుందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

PREV
click me!

Recommended Stories

శ్రీ సత్యసాయి ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ | Asianet News Telugu
Vijay Deverakonda Superb Speech: విజయ్ దేవరకొండ స్పీచ్ కి సభ మొత్తం అరుపులే | Asianet News Telugu