ముందస్తు ఎఫెక్ట్: ఇతర పార్టీలతో పొత్తుల కోసం టిపిసిసి కమిటీ

By Arun Kumar PFirst Published Sep 7, 2018, 8:12 PM IST
Highlights

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతూ తమ అభ్యర్ధులను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. కేసీఆర్ దూకుడును చూసి ప్రతిపక్షాలు కూడా దూకుడును పెంచాయి. ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ కూడా ఇతర పార్టీలతో పొత్తులపై చర్చించేందుకు ఓ కమిటీని నియమించింది. 

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతూ తమ అభ్యర్ధులను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. కేసీఆర్ దూకుడును చూసి ప్రతిపక్షాలు కూడా దూకుడును పెంచాయి. ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ కూడా ఇతర పార్టీలతో పొత్తులపై చర్చించేందుకు ఓ కమిటీని నియమించింది. 

టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో పిసిసి పొత్తుల కమిటీ నియామకం జరిగింది. ఈ కమిటీ కాంగ్రెస్ కలిసి ఎన్నికల బరిలోకి దిగేందుకు ఇష్టపడుతున్న పార్టీలను మిత్రపక్షాలుగా మలుచుకునేందుకు చర్చలు జరపనుంది. రెండ్రోజుల్లో ఈ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఏయే పార్టీలతో పొత్తు పెట్టుకోవచ్చు, పొత్తుల వల్ల లాభాలేమిటి వంటి విషయాలను చర్చించనున్నారు. దీని తర్వాతే ఈ కమిటీ ఏకాభిప్రాయంతో ఇతర పార్టీలతో చర్చలు జరిపి పొత్తులు కుదుర్చుకోనుందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

click me!