తెలంగాణలో టీచర్ల బదిలీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీనిపై శుక్రవారం విద్యా శాఖ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 3 నుంచి 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని ప్రభుత్వం వెల్లడించింది.
తెలంగాణలో టీచర్ల బదిలీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీనిపై శుక్రవారం విద్యా శాఖ షెడ్యూల్ విడుదల చేసింది. టీచర్ల బదిలీలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ప్రభుత్వం ఈ ప్రక్రియను తిరిగి ప్రారంభించనుంది. ఈ నెల 3 నుంచి 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని ప్రభుత్వం వెల్లడించింది. అలాగే ఈ నెల 6 మరియు 7వ తేదీల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసిన కాపీలను డీఈవో కార్యాలయంలో సమర్పించాల్సి వుంటుంది. అలాగే 8 , 9 తేదీల్లో దరఖాస్తు చేసుకున్న వారి పేర్లను అధికారులు ప్రకటిస్తారు. తర్వాత 10, 11 తేదీల్లో అభ్యంతరాలను స్వీకరిస్తారు.