తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం: రాష్ట్రంలోని 118 నియోజకవర్గాల్లోనూ దళితబంధు

Siva Kodati |  
Published : Jan 22, 2022, 03:22 PM ISTUpdated : Jan 22, 2022, 03:25 PM IST
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం: రాష్ట్రంలోని 118 నియోజకవర్గాల్లోనూ దళితబంధు

సారాంశం

118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దళిత బంధును అమలు చేయాలని నిర్ణయించారు. దీని ప్రకారం తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో దళిత బంధు అమలు కానుంది. ప్రతి నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఎమ్మెల్యేల సలహాతో ఈ జాబితాను రూపొందించనున్నారు.

ప్రతిష్టాత్మక దళిత బంధు (dalitha bandhu ) కార్యక్రమంపై మంత్రి కొప్పుల ఈశ్వర్ (koppula eshwar) , తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ (somesh kumar) సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాల కలెక్టర్లతో వారు శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా 118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దళిత బంధును అమలు చేయాలని నిర్ణయించారు. దీని ప్రకారం తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో దళిత బంధు అమలు కానుంది. ప్రతి నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఎమ్మెల్యేల సలహాతో ఈ జాబితాను రూపొందించనున్నారు. బ్యాంక్ లింకుతో సంబంధం లేకుండా 10 లక్షల ఆర్ధిక సాయాన్ని లబ్ధిదారులకు అందజేస్తారు. లబ్ధిదారుడు కోరుకున్న యూనిట్‌ను ఎంపిక చేస్తారు. ఇప్పటికే వాసాలమర్రి (vasalamarri) , హుజురాబాద్‌లో (huzurabad) దళిత బంధును అమలు చేశారు.     

PREV
click me!

Recommended Stories

శ్రీ సత్యసాయి ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ | Asianet News Telugu
Vijay Deverakonda Superb Speech: విజయ్ దేవరకొండ స్పీచ్ కి సభ మొత్తం అరుపులే | Asianet News Telugu