మాదాపూర్: పబ్ లో ఫుల్‌గా మద్యం తాగి .. రోడ్డు మీదకు వెళ్ళి..

By telugu teamFirst Published Nov 16, 2019, 2:11 PM IST
Highlights

రోడ్డునెం.36లోని పబ్బులో నలుగురు విద్యార్థులు మద్యం సేవించినట్లు పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో మాదాపూర్ వైపు ఓవర్ స్పీడ్ తో డ్రైవింగ్ చేసినట్లు చెప్పారు.

హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పబ్బులో మద్యం సేవించి విద్యార్థులు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వాహనం నడిపారు. ఈ ఘటనలో మనీష్ అనే విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందారు. కాగా.. ఐశ్వర్య అనే మరో విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి.

రోడ్డునెం.36లోని పబ్బులో నలుగురు విద్యార్థులు మద్యం సేవించినట్లు పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో మాదాపూర్ వైపు ఓవర్ స్పీడ్ తో డ్రైవింగ్ చేసినట్లు చెప్పారు. రోడ్డుపై ఉన్న క్రేన్ వీరు ప్రయాణిస్తున్న కారు ఢీ కొట్టింది. దీంతో వెంటనే కారు బోల్తా కొట్టింది. 

click me!