శ్రీ ఆదిత్య ఆసుపత్రి ఎండీ డాక్టర్ రవీందర్‌ ఆత్మహత్య

By narsimha lodeFirst Published Mar 9, 2020, 4:28 PM IST
Highlights

మేడ్చల్‌లోని శ్రీఆదిత్య ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్ రవీందర్ కుమార్ సోమవారం నాడు మధ్యాహ్నం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 


మేడ్చల్:మేడ్చల్‌లోని శ్రీఆదిత్య ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్ రవీందర్ కుమార్ సోమవారం నాడు మధ్యాహ్నం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

తన  లైసెన్స్ రివాల్వర్‌తో కాల్చుకొని  ఆయన  ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే రవీందర్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడినట్టుగా  ఆయన సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నారు. 

ఈ విషయం తెలుసుకొన్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని  మృతదేహాన్ని స్వాధీనం చేసుకొన్నారు. డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ తో   ఆధారాల కోసం సేకరిస్తున్నారు.  సిద్దిపేటకు చెందిన రవీందర్ కాప్రా సాకేత్ మిధులలో నివాసం ఉంటున్నారు. ఈ ఘటనపై ఆయన కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
 

click me!