టీకా వేస్తానని.. మత్తు ఇంజెక్షన్, వృద్ధ దంపతులను దోచేసిన నర్స్

Siva Kodati |  
Published : Feb 14, 2021, 05:25 PM IST
టీకా వేస్తానని.. మత్తు ఇంజెక్షన్, వృద్ధ దంపతులను దోచేసిన నర్స్

సారాంశం

హైదరాబాద్‌లో కరోనా టీకాతో వృద్ధ దంపతులకి టోపీ పెట్టిందో ప్రైవేట్ ఆసుపత్రి నర్స్. వ్యాక్సినేషన్ చేస్తానని చెప్పి మత్తు మందు ఇచ్చి ఒంటిపై వున్న నగలు అపహరించింది.

హైదరాబాద్‌లో కరోనా టీకాతో వృద్ధ దంపతులకి టోపీ పెట్టిందో ప్రైవేట్ ఆసుపత్రి నర్స్. వ్యాక్సినేషన్ చేస్తానని చెప్పి మత్తు మందు ఇచ్చి ఒంటిపై వున్న నగలు అపహరించింది.

మొదటిసారి పాయసంలో మత్తు మందు కలిపి ఇచ్చినప్పటికీ ఆ దంపతులకి షుగర్ వుండటంతో పాయసం పడేశారు. రెండోసారి కరోనా టీకా పేరుతో స్కెచ్ వేసింది నర్స్. వ్యాక్సిన్ అంటూ మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది.

దీంతో దంపతులు స్పృహ తప్పడంతో అనంతరం నగలను ఎత్తుకెళ్లింది. మత్తు నుంచి తేరుకున్నాకా మోసపోయామని గ్రహించిన వృద్ధులు మీర్‌పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కిలాడీ నర్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu