
హైదరాబాద్ నగరంలోని బాలాపూర్ గుర్రం చెరువు ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మట్టి కుంటలో ఇరుక్కుపోయిన హనుమంతు అనే వృద్ధుడిని స్థానికుల సమాచారంతో పోలీసులు సమయానికి చేరుకుని రక్షించారు. తాడు సహాయంతో జాగ్రత్తగా బయటకు తీసిన పోలీసులు ఆయన ప్రాణాలను కాపాడారు. స్వల్ప గాయాలతో వృద్ధుడు సురక్షితంగా బయటపడడంతో స్థానికులు పోలీసులను ప్రశంసించారు.