భూకబ్జా ఆరోపణలు: మంత్రి మల్లారెడ్డిపై కేసు

Siva Kodati |  
Published : Dec 08, 2020, 07:03 PM ISTUpdated : Dec 08, 2020, 07:05 PM IST
భూకబ్జా ఆరోపణలు: మంత్రి మల్లారెడ్డిపై కేసు

సారాంశం

తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై భూ కబ్జా కేసు నమోదైంది. తన భూమిలో మల్లారెడ్డి అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ.. కుత్బుల్లాపూర్‌ మండలం సూరారంకు చెందిన శ్యామలదేవి అనే మహిళ మల్లారెడ్డిపై మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై భూ కబ్జా కేసు నమోదైంది. తన భూమిలో మల్లారెడ్డి అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ.. కుత్బుల్లాపూర్‌ మండలం సూరారంకు చెందిన శ్యామలదేవి అనే మహిళ మల్లారెడ్డిపై మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మల్లారెడ్డి చెరలో ఉన్న భూమిని విడిపించాలంటూ ఓ న్యాయవాదిని సంప్రదిస్తే.. ఆయనతోనే మంత్రి మల్లారెడ్డి కుమ్మక్కై తప్పుడు పత్రాలు సృష్టించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్యామలదేవి ఫిర్యాదు మేరకు దుండిగల్‌ పోలీసులు మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
 

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?