కరోనా ఎఫెక్ట్: కరీంనగర్ లో ఇండోనేషియా బృందానికి ఆశ్రయమిచ్చిన వ్యక్తి అరెస్ట్

Published : Mar 22, 2020, 12:52 PM IST
కరోనా ఎఫెక్ట్: కరీంనగర్ లో ఇండోనేషియా బృందానికి ఆశ్రయమిచ్చిన వ్యక్తి అరెస్ట్

సారాంశం

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇండోనేషియా వాసులకు ఆశ్రయం ఇచ్చిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొన్నామని కరీంనగర్ కమిషనర్ కమల్‌హసన్ రెడ్డి ప్రకటించారు. 

కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇండోనేషియా వాసులకు ఆశ్రయం ఇచ్చిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొన్నామని కరీంనగర్ కమిషనర్ కమల్‌హసన్ రెడ్డి ప్రకటించారు. 

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఇండోనేషియా నుండి ఓ ప్రతినిధి బృందం వచ్చింది.ఈ బృందం సభ్యులకు కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారు. అయితే ఈ బృందానికి ఆశ్రయం కల్పించిన వ్యక్తికి కూడ పాజిటివ్ లక్షణాలు కూడ ఉన్నాయని రిపోర్టులు తేల్చి చెప్పాయి.

also read:కరోనా దెబ్బ: ఒకే రోజు ఇద్దరు మృతి, ఇండియాలో ఆరుకు చేరిన మృతుల సంఖ్య

ఇండోనేషియా బృందానికి ఆశ్రయం కల్పించిన వ్యక్తికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్న విషయం తేలింది. అయితే అతను ఐసోలేషన్ కు పరిమితం కాకుండా తప్పించుకు తిరిగాడు.

తప్పించుకొని తిరుగుతున్న ఆ వ్యక్తిని శనివారం నాడు రాత్రి కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. కరీంనగర్ పట్టణంలో పెద్ద ఎత్తున పాజిటివ్ లక్షణాలు ఉన్న వ్యక్తులు ఉండడంతో జిల్లా యంత్రాంగం కూడ జాగ్రత్తలు తీసుకొంటుంది.

PREV
click me!

Recommended Stories

Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
Telangana : తొలివిడత పంచాయతీ పోలింగ్ షురూ.. ఈ ఎన్నికలకే ఇంత ఖర్చా..!