క్యూనెట్ స్కాంలో 20 లక్షలు పొగొట్టుకున్నానని..బాధితుడు ఆత్మహత్య

Siva Kodati |  
Published : Jul 31, 2019, 09:17 AM IST
క్యూనెట్ స్కాంలో 20 లక్షలు పొగొట్టుకున్నానని..బాధితుడు ఆత్మహత్య

సారాంశం

హైదరాబాద్ మాదాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. అరవింద్ అనే క్యూనెట్ సంస్థ బాధితుడు బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. క్యూనెట్ స్కాంలో అతను సుమారు రూ.20 లక్షల వరకు పొగొట్టుకున్నాడు. 

హైదరాబాద్ మాదాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. అరవింద్ అనే క్యూనెట్ సంస్థ బాధితుడు బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. క్యూనెట్ స్కాంలో అతను సుమారు రూ.20 లక్షల వరకు పొగొట్టుకున్నాడు.

దీంతో మనస్తాపానికి గురైన అరవింద్.. కొద్దిరోజుల నుంచి లోలోపల కుమిలిపోతున్నాడు, దీనికి తోడు ఆర్ధిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అరవింద్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా... క్యూనెట్ సంస్థ మోసాలపై సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పలువురు ఫిర్యాదు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: ఇక ఊపిరి పీల్చుకోండి.. రూ. 700 కోట్ల‌తో భారీ ఫ్లై ఓవ‌ర్‌. ఈ ప్రాంతంలో ఊహించ‌ని మార్పు
Indian Air Force Jobs : కేవలం తెలుగు యువతకు మాత్రమే.. ఇంటర్ అర్హతతోనే భారత వాయుసేనలో ఉద్యోగావకాశాలు