ఎన్నికల్లో గెలిపించాలని పంచాయతీకి డబ్బు...ఓడిపోవడంతో తిరిగి వసూలు

By Siva KodatiFirst Published Jun 9, 2019, 10:13 AM IST
Highlights

మంచిర్యాల జిల్లాలో ఎంపీటీసీ అభ్యర్ధి పైసా వసూల్ పర్వానికి దిగాడు. లింగయ్యపల్లి నుంచి హన్మంతరావు అనే వ్యక్తి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి నిలిచాడు. 

మంచిర్యాల జిల్లాలో ఎంపీటీసీ అభ్యర్ధి పైసా వసూల్ పర్వానికి దిగాడు. లింగయ్యపల్లి నుంచి హన్మంతరావు అనే వ్యక్తి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి నిలిచాడు. కొత్తగా ఏర్పడిన ఈ పంచాతీ అభివృద్ధితో పాటు..  స్థానిక ఎన్నికలకు ముందు తనను గెలిపించాలంటూ గ్రామపంచాయతీకి రూ.6 లక్షలు ఇచ్చాడు.

అయితే ఎన్నికల్లో అతను ఓడిపోవడంతో.. దీంతో డబ్బులు తీసుకుని ఓటు వేయలేదంటూ తాను ఇచ్చిన డబ్బును పంచాయతీ నుంచి వెనక్కు తీసుకున్నాడు. ఈ తతంతగాన్ని అక్కడున్న వారిలో ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది కాస్తా వైరల్ అయ్యింది. 

click me!