చిన్న గొడవ.. భార్యను గొడ్డలితో నరికిన భర్త.. !

Published : May 11, 2021, 02:06 PM IST
చిన్న గొడవ.. భార్యను గొడ్డలితో నరికిన భర్త.. !

సారాంశం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది. భార్యభర్తల మధ్య చెలరేగిన గొడవ హత్యకు దారితీసింది. వివరాల్లోకి వెడితే..  

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది. భార్యభర్తల మధ్య చెలరేగిన గొడవ హత్యకు దారితీసింది. వివరాల్లోకి వెడితే..

రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్లపల్లి మండలంలో భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో కోపోద్రిక్తుడైన భర్త వెంకటేశం ఆవేశంతో భార్య లచ్చవ్వపై గొడ్డలితో దాడిచేశాడు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన లచ్చవ్వను హుటా హుటీన సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుండి కరీంనగర్ తరలించారు. కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొదుతూ లచ్చవ్వ మృతి చెందింది. 
 

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్