చిన్న గొడవ.. భార్యను గొడ్డలితో నరికిన భర్త.. !

By AN TeluguFirst Published May 11, 2021, 2:06 PM IST
Highlights

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది. భార్యభర్తల మధ్య చెలరేగిన గొడవ హత్యకు దారితీసింది. వివరాల్లోకి వెడితే..
 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది. భార్యభర్తల మధ్య చెలరేగిన గొడవ హత్యకు దారితీసింది. వివరాల్లోకి వెడితే..

రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్లపల్లి మండలంలో భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో కోపోద్రిక్తుడైన భర్త వెంకటేశం ఆవేశంతో భార్య లచ్చవ్వపై గొడ్డలితో దాడిచేశాడు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన లచ్చవ్వను హుటా హుటీన సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుండి కరీంనగర్ తరలించారు. కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొదుతూ లచ్చవ్వ మృతి చెందింది. 
 

click me!