పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్సీలకు నోటీసులు జారీ

By narsimha lodeFirst Published Dec 18, 2018, 5:23 PM IST
Highlights

టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన నలుగురు ఎమ్మెల్సీలకు శాసనమండలి ఛైర్మెన్ స్వామి గౌడ్ బుధవారం నాడు నోటీసులు జారీ చేశారు.


హైదరాబాద్: టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన నలుగురు ఎమ్మెల్సీలకు శాసనమండలి ఛైర్మెన్ స్వామి గౌడ్ బుధవారం నాడు నోటీసులు జారీ చేశారు.

పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని  కోరుతూ టీఆర్ఎస్ శాసనమండలి ఛైర్మెన్ కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు బుధవారం నాడు శాసనమండలి ఛైర్మెన్  స్వామిగౌడ్ నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లోపుగా ఈ నోటీసులకు సమాధానం చెప్పాలని ఆదేశించారు.

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా  టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొండా మురళి, యాధవరెడ్డి, రాములు నాయక్, భూపతి రెడ్డిలు  పార్టీ మారారు. దీంతో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నందున  ఈ నలుగురిపై చర్యలు తీసుకోవాలని  టీఆర్ఎస్ ప్రతినిధి బృందం సోమవారం నాడు  మండలి ఛైర్మెన్ స్వామి గౌడ్‌కు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా స్వామిగౌడ్ నోటీసులు జారీ చేశారుఈ ఈ నోటీసులపై ఎమ్మెల్సీలు ఏ రకంగా  స్పందిస్తారో  చూడాలి.

click me!