తెలంగాణ ప్రజలకు కేటీఆర్ ధన్యవాదాలు

Published : Dec 11, 2018, 01:07 PM IST
తెలంగాణ ప్రజలకు కేటీఆర్ ధన్యవాదాలు

సారాంశం

తెలంగాణ ప్రజలకు మంత్రి కేటీఆర్.. ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ఈ రోజు లెక్కింపు ప్రక్రియ మొదలైన సంగతి తెలిసిందే. కాగా.. టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంతో దూసుకుపోతోంది. 

తెలంగాణ ప్రజలకు మంత్రి కేటీఆర్.. ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ఈ రోజు లెక్కింపు ప్రక్రియ మొదలైన సంగతి తెలిసిందే. కాగా.. టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంతో దూసుకుపోతోంది.  దాదాపు 90 స్థానాలకుపైగా టీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. దాదాపు టీఆర్ఎస్ గెలుపు ఖాయమైంది.

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు దన్యవాదాలు చెబుతూ.. కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘‘కేసీఆర్ పై నమ్మకం ఉంచినందుకు, మరో అవకాశం మాకు ఇచ్చినందుకు దన్యవాదాలు’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. 

 

తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 7వ తేదీన జరిగిన పోలింగ్‌ ఫలితాలు మరికొద్దిసేపట్లో వెల్లడి కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1821 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు విధుల్లో సుమారు 40వేలకు పైగా సిబ్బంది ఉన్నారు.

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో అద్భుతం.. రూ. 350 కోట్ల‌తో ల‌గ్జ‌రీ హోట‌ల్‌. ఎక్క‌డో తెలుసా.?
ఉచితంగా రూ. 4 వేల వ్యాక్సిన్‌.. దేశ‌వ్యాప్తంగా టీకాల పంపిణీ. ఉప‌యోగం ఏంటీ? ఎవ‌రు తీసుకోవాలి.?