కాంగ్రెసుకు కౌశిక్ రెడ్డి రాజీనామా: అధికారిక ప్రకటన

Published : Jul 12, 2021, 04:29 PM ISTUpdated : Jul 12, 2021, 04:56 PM IST
కాంగ్రెసుకు కౌశిక్ రెడ్డి రాజీనామా: అధికారిక ప్రకటన

సారాంశం

తెలంగాణ పీసీసీ క్రమశిక్షణ సంఘం నుంచి షోకాజ్ నోటీస్ అందుకున్న పార్టీ హుజూరాబాద్ నాయకుడు కౌశిక్ రెడ్డి రాజీనామా చేశారు.. ఆ విషయాన్ని ఆయన అధికారికంగా ప్రకటించారు.

హైదరాబాద్: హుజూరాబాద్ నాయకుడు కౌశిక్ రెడ్డి కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశారు. ఆ విషయాన్ని ఆయన అధికారికంగా ప్రకటించారు సోమవారం ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయన తన అనుచరులతో సంప్రదింపులు జరిపారు. తెలంగాణ పీసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ఆయన రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

హుజురాబాద్ టీఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందని చెప్పిన ఆయన ఫోన్ కాల్ ఆడియో లీక్ కావడంతో తెలంగాణ పీసీసీ క్రమశిక్షణ సంఘం ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. 24 గంటలలోగా తమ షోకాజ్ నోటీసుకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నించారు. ఆయన రేవంత్ రెడ్డి అపాయింట్ మెంట్ కోరారు. 

ఇదిలావుంటే, తెలంగాణ మంత్రి కేటీ రామారావును కలిసినప్పుడే తమ పార్టీ హుజూరాబాద్ నాయకుడు కౌశిక్ రెడ్డిపై అనుమానాలు వచ్చాయని తెలంగాణ పీసీసీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. కౌశిక్ రెడ్డి 24 గంటల లోపల సంతృప్తికరమైన సమాధానం ఇవ్వాలని ఆయన అన్నారు. సరైన వివరణ ఇవ్వకపోతే కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని ఆయన సోమవారం మీడియా సమావేశంలో అన్నారు 

కాంగ్రెసుకు నష్టం వచ్చే విధంగా కౌశిక్ రెడ్డి మాట్లాడారని కోదండ రెడ్డి అన్నారు. కేటీఆర్ ను కలిసిప్పుడే తాము హెచ్చరించామని, అయితే హెచ్చరికలు జారీ చేసిన కౌశిక్ రెడ్డిలో మార్పు రాలేదని ఆయన అన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ పీసీసీ క్రమశిక్షణా సంఘానికి సూచించింది. టీపీసీసీ మార్గదర్శకాల నేపథ్యంలో క్రమశిక్షణ సంఘం కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది.

కాగా, పార్టీ  క్రమశిక్షణ సంఘం నోటీసులు అందుకున్న హుజూరాబాద్ పార్టీ నాయకుడు కౌశిక్ రెడ్డి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అపాయింట్ మెంట్ కోరారు. ఆయన రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఇదిలావుంటే, తమ పార్టీ హుజూరాబాద్ నాయకుడు కౌశిక్ రెడ్డికి తెలంగాణ పీసీసీ నోటీసులు జారీ చేసింది. హుజూరాబాద్ టీఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందని కౌశిక్ రెడ్డి చెప్పిన మాటల ఆడియో వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఆయనకు తెలంగాణ పీసీసీ నోటీసులు ఇచ్చింది. వచ్చే 24 గంటలలోగా వివరణ ఇవ్వాలని పీసీసీ ఆయనను ఆేదశించింది. 

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ పీసీసీ కౌశిక్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. గతంలో కూడా కౌశిక్ రెడ్డిని తెలంగాణ పీసీసీ క్రమశిక్షణా సంఘం హెచ్చరించింది. తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో కౌశిక్ రెడ్డి రహస్య మంతనాలు జరిపినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

దాంతో కౌశిక్ రెడ్డి కాంగ్రెసుకు రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారం సాగింది. ఈటల రాజేందర్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆ ప్రచారం సాగింది. ఈటల రాజేందర్ బిజెపిలో చేరారు. బిజెపి తరఫున ఆయన హుజూరాబాద్ నుంచి పోటీ చేయడం ఖాయమైంది. 

ఇప్పటి వరకు టీఆర్ఎస్ తన హుజూరాబాద్ నియోజకవర్గం అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఆ పార్టీ నాయకత్వం అభ్యర్థి వేటలో ఉంది. దీంతో కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరి పోటీ చేస్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఆయన గతంలో కాంగ్రెసు తరఫున ఈటల రాజేందర్ మీద పోటీ చేశారు. కౌశిక్ రెడ్డి తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సన్నిహిత బంధువు. 

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu