కొండగట్టు ప్రమాదం...బస్సు నడిపింది ఈ ఉత్తమ డ్రైవరే...

Published : Sep 11, 2018, 07:30 PM ISTUpdated : Sep 19, 2018, 09:23 AM IST
కొండగట్టు ప్రమాదం...బస్సు నడిపింది ఈ ఉత్తమ డ్రైవరే...

సారాంశం

తెలంగాణలోని పవిత్ర పుణ్యక్షేత్రం కొండగట్టు అంజనేయ స్వామి దేవాలయ ఘాటు రోడ్డు పై ఇవాళ ఘోర ప్రమాదం జరిగింది. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్న జగిత్యాల డిపోకు చెందిన ఓ ఆర్టీసి బస్సు అదుపుతప్పి ఘాట్ రోడ్డుపై నుండి లోయలోకి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 55 మంది ప్రయాణికులు మరణించగా మరో 30 మంది తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు.   

తెలంగాణలోని పవిత్ర పుణ్యక్షేత్రం కొండగట్టు అంజనేయ స్వామి దేవాలయ ఘాటు రోడ్డు పై ఇవాళ ఘోర ప్రమాదం జరిగింది. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్న జగిత్యాల డిపోకు చెందిన ఓ ఆర్టీసి బస్సు అదుపుతప్పి ఘాట్ రోడ్డుపై నుండి లోయలోకి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 55 మంది ప్రయాణికులు మరణించగా మరో 30 మంది తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. 

ఈ ఘోర ప్రమాదంలో ఆర్టీసి డ్రైవర్ శ్రీనివాస్ కూడా మృతి చెందారు. గత ఆగస్ట్ 15 వ తేదీన జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో ఇతడు ఆర్టీసి అందించే ఉత్తమ డ్రైవర్ అవార్డును అందుకున్నాడు. అలాంటిది ఇతడు డ్రైవింగ్ లోనే  బస్సు ప్రమాదానికి గురయ్యింది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఈ బస్సు ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఇంత మంది ప్రాణాలను బలితీసుకున్న ప్రమాదానికి గల కారణాలను కనుక్కోడానికి విచారణ చేపట్టింది. ఈ దుర్ఘటన నేపథ్యంలో జగిత్యాల ఆర్టీసి డిపో మేనేజర్ హన్మంతరావుపై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. 

 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌