గద్వాలలో పరువు హత్య: కూతురిని కడతేర్చిన తల్లిదండ్రులు

By Siva KodatiFirst Published Jun 8, 2020, 8:26 PM IST
Highlights

గద్వాల జిల్లాలో పరువు హత్య చోటు చేసుకుంది. డిగ్రీ చదువుతున్న విద్యార్ధిని దివ్యను ఆమె తల్లిదండ్రులే దారుణంగా హత్య చేశారు. కూతురు వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించిందనే కోపంతో గొంతునులిమి హతమార్చారు

గద్వాల జిల్లాలో పరువు హత్య చోటు చేసుకుంది. డిగ్రీ చదువుతున్న విద్యార్ధిని దివ్యను ఆమె తల్లిదండ్రులే దారుణంగా హత్య చేశారు. కూతురు వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించిందనే కోపంతో గొంతునులిమి హతమార్చారు. మానవపాడు మండలం కలుకుంట్లలో ఈ ఘటన జరిగింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దివ్య తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దివ్య మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

click me!