
తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ఇది కేవలం ప్రారంభమేనని, అసలు ఎండల దాడి ఏప్రిల్ 24 నుంచి మొదలవుతుందని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరించారు. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో 43-45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముండటంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. కొన్ని జిల్లాలకు ఆరెంజ్, మరికొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ప్రజలు అవసరం లేకపోతే బయటకు వెళ్లకుండా, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.