జుమ్మెరాత్ బజార్ లో పోలీసుల లాఠీచార్జ్ : ఎమ్మెల్యే రాజాసింగ్ కు తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు

Published : Jun 20, 2019, 08:09 AM ISTUpdated : Jun 20, 2019, 10:37 AM IST
జుమ్మెరాత్ బజార్ లో పోలీసుల లాఠీచార్జ్ : ఎమ్మెల్యే రాజాసింగ్ కు తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు

సారాంశం

పోలీసుల లాఠీచార్జ్ లో గోషా మహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తలకు తీవ్ర గాయమైంది. తల నుంచి రక్తం తీవ్రంగా  కారడంతో ఆయనను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో రాజాసింగ్ వైద్యం చేయించుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. 


హైదరాబాద్‌: జుమ్మెరాత్‌ బజార్‌లో బుధవారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జుమ్మెరాత్ బజార్‌లోని స్థానికులంతా కలిసి రాణి అవంతిభాయ్‌ విగ్రహ నిర్మాణాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  

రాణి అవంతిభాయ్ విగ్రహ ఏర్పాటును పోలీసులు అడ్డుకున్నారు. విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రస్తుతానికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. 

గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తన అనుచరులతో కలిసి ఆందోళనకు దిగారు. ఒకానొక దశలో పోలీసులు, రాజాసింగ్ అనుచరుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పరిస్తితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. 

పోలీసుల లాఠీచార్జ్ లో గోషా మహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తలకు తీవ్ర గాయమైంది. తల నుంచి రక్తం తీవ్రంగా  కారడంతో ఆయనను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో రాజాసింగ్ వైద్యం చేయించుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్