ఖమ్మంలో రోడ్డు ప్రమాదం: మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డికి స్వల్ప గాయాలు

Published : Jul 01, 2020, 11:05 AM IST
ఖమ్మంలో రోడ్డు ప్రమాదం: మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డికి స్వల్ప గాయాలు

సారాంశం

మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయన స్వల్పగాయాలతో బయటపడ్డాడు. 


ఖమ్మం: మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయన స్వల్పగాయాలతో బయటపడ్డాడు. 

ఉమ్మడి ఖమ్మం జిల్లా సుజాతనగర్ మండలం డేగలమడుగు వద్ద ఖమ్మం నుండి కొత్తగూడెం వైపు వస్తున్న కారు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహానాన్ని ఢీకొట్టింది. దీంతో రాంరెడ్డి దామోదర్ రెడ్డి వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి స్వల్పంగా గాయపడ్డాడు.

రోడ్డు ప్రమాదం విషయం తెలుసుకొన్న స్థానికులు మాజీ మంత్రి దామోదర్ రెడ్డిని స్థానిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మరో వాహనంలో దామోదర్ రెడ్డిని ఆయన స్వగ్రామం లింగాలకు పంపారు. 

మాజీ మంత్రి కారును ఢీకొట్టిన కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఈ ప్రమాదంలో దామోదర్ రెడ్డి స్వల్పగాయాలతో బయటపడడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఆయన మద్దతుదారులు ఊపిరి పీల్చుకొన్నారు.

ఖమ్మం జిల్లాలోని లింగాల దామోదర్ రెడ్డిది స్వంత గ్రామం. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గాల నుండి దామోదర్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. 
 

PREV
click me!

Recommended Stories

Heavy Rain Alert : రుతుపవనాలు అలర్ట్, అల్పపీడనం క్రియేట్, ద్రోణి, ఆవర్తనం ఎఫెక్ట్.. ఈ ప్రాంతాలపై వర్షాల దండయాత్రే, ఈదురుగాలులతో దబిడిదిబిడే
Kalvakuntla Kavitha: కొడంగల్‌లో 22 వేల డూప్లికేట్ ఓట్లు? కవిత సంచలన కామెంట్స్| Asianet News Telugu