మంత్రి ఈటలను కలిసి కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ

By telugu teamFirst Published Jul 25, 2019, 1:59 PM IST
Highlights

కేంద్రం నుంచి తెలంగాణకి భారీగా నిధులు వస్తున్నాయని చెప్పారు. 32 జిల్లా కేంద్రాలలో ఆయుష్ హాస్పిటల్స్ ని నిర్మించాలని కోరుతున్నామన్నారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో సికింద్రాబాద్ లో ఆయుష్ హాస్పిటల్ మంజూరు చేసినట్లు చెప్పారు. 

తెలంగాణ మంత్రి ఈటలను కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ గురువారం కలిశారు. పాతబస్తీలో ఉన్న ప్రముఖ ఆయుర్వేద హాస్పిటల్, కళాశాలను తెలంగాణ ప్రభుత్వం ఎర్రగడ్డకు తరలిస్తోంది. కాగా... ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని  దత్తాత్రేయ మంత్రి ఈటలను కోరారు. ఎన్నో సంవత్సరాలుగా ఆ హాస్పిటల్ కి చికిత్స కోసం ప్రజలు వస్తున్నారని ఆయన అన్నారు.

ఇప్పటికిప్పుడు ఆ హాస్పిటల్ ని అక్కడి నుంచి మారిస్తే ప్రజలు ఇబ్బందులు పడతారని ఆయన అన్నారు. అందుకే తన వినపాన్ని బీజేపీ తరపున మంత్రి ఈటలకు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ఆయుర్వేదిక్, హోమియో, ఆయులకు నిధులు కేటాయిస్తోందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

కేంద్రం నుంచి తెలంగాణకి భారీగా నిధులు వస్తున్నాయని చెప్పారు. 32 జిల్లా కేంద్రాలలో ఆయుష్ హాస్పిటల్స్ ని నిర్మించాలని కోరుతున్నామన్నారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో సికింద్రాబాద్ లో ఆయుష్ హాస్పిటల్ మంజూరు చేసినట్లు చెప్పారు. 

click me!