బీజేపీ బలోపేతమే లక్ష్యం .. మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాలపై విశ్వాసం వుంది : ఈటల , రాజగోపాల్ రెడ్డి

Siva Kodati |  
Published : Jun 24, 2023, 11:01 PM IST
బీజేపీ బలోపేతమే లక్ష్యం .. మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాలపై విశ్వాసం వుంది : ఈటల , రాజగోపాల్ రెడ్డి

సారాంశం

ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా నాయకత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం వుందన్నారు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తాము చెప్పిన అంశాలపై అగ్రనేతలు సానుకూలంగా స్పందించారని వారు పేర్కొన్నారు.

ఢిల్లీలో బీజేపీ పెద్ధలతో ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ ముగిసింది. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, అనుసరించాల్సిన వ్యూహంపై విసృత చర్చించామని తెలిపారు. కేసీఆర్ దోపిడీ పాలనకు అడ్డుకట్ట పడాలంటే బీజేపీతోనే సాధ్యమని వారు పేర్కొన్నారు. ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా నాయకత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం వుందని వీరిద్దరూ తెలిపారు. నిర్ణయాలు వేగంగా వుండాలని అధిష్టానాన్ని కోరామని.. తాము చెప్పిన అంశాలపై అగ్రనేతలు సానుకూలంగా స్పందించారని వారు పేర్కొన్నారు. తెలంగాణలో త్వరలోనే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా చర్యలు వుంటాయని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈటల పేర్కొన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Entrance Exams : పదో తరగతి తర్వాత ఫ్రీగా ఇంటర్ చదవాలా..? అయితే తప్పక రాయాల్సిన ప్రవేశ పరీక్షలివే
Hyderabad : రూ.50 లక్షల్లోనే ఇండిపెండెంట్ హౌస్.. హైదరాబాద్ లో అతితక్కువ ధరకే ఇళ్లు లభించే టాప్ 5 ప్రాంతాలివే..!