పెద్ద అంబర్ పేట వద్ద ప్రమాదం.. ‘ఈనాడు’ ఉద్యోగులకు గాయాలు

Published : Nov 26, 2019, 09:19 AM IST
పెద్ద అంబర్ పేట వద్ద ప్రమాదం.. ‘ఈనాడు’ ఉద్యోగులకు గాయాలు

సారాంశం

 ప్రముఖ వార్తా పత్రిక ఈనాడు సంస్థకు చెందిన ఉద్యోగులు వెళ్తున్న బస్సును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో పలువురు ఈనాడు ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం 12మంది గాయపడగా.... వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

పెద్ద అంబర్ పేట్ అవుటర్ రింగ్ రోడ్డు వద్ద సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రముఖ వార్తా పత్రిక ఈనాడు సంస్థకు చెందిన ఉద్యోగులు వెళ్తున్న బస్సును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో పలువురు ఈనాడు ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం 12మంది గాయపడగా.... వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గరలోని అమ్మ హాస్పిటల్ కి తరలించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఉద్యోగం ముగించుకొని ఇంటికి వస్తుండగా... ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: ఇక ఊపిరి పీల్చుకోండి.. రూ. 700 కోట్ల‌తో భారీ ఫ్లై ఓవ‌ర్‌. ఈ ప్రాంతంలో ఊహించ‌ని మార్పు
Indian Air Force Jobs : కేవలం తెలుగు యువతకు మాత్రమే.. ఇంటర్ అర్హతతోనే భారత వాయుసేనలో ఉద్యోగావకాశాలు