యాదాద్రిలో జింక మాంసంతో పార్టీ:విందులో పలువురు రాజకీయ నేతలు

Siva Kodati |  
Published : Aug 01, 2019, 03:38 PM ISTUpdated : Aug 01, 2019, 07:35 PM IST
యాదాద్రిలో జింక మాంసంతో పార్టీ:విందులో పలువురు రాజకీయ నేతలు

సారాంశం

యాదాద్రి భువనగిరి జిల్లాలో జింక వేట కలకలం రేపుతోంది. మోత్కురు మండలం కొండాపూర్‌లో జింకను వలపన్ని వేటాడి పలువురు విందు చేసుకున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. ఈ పార్టీలో పలువురు రాజకీయ ప్రముఖులు ఉన్నట్లుగా ఆరోపణలు రావడం సంచలనం కలిగిస్తోంది.

యాదాద్రి భువనగిరి జిల్లాలో జింక వేట కలకలం రేపుతోంది. మోత్కురు మండలం కొండాపూర్‌లో జింకను వలపన్ని వేటాడి పలువురు విందు చేసుకున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. ఈ పార్టీలో పలువురు రాజకీయ ప్రముఖులు ఉన్నట్లుగా ఆరోపణలు రావడం సంచలనం కలిగిస్తోంది.

మూడు రోజుల క్రితం ఈ సంఘటన జరగ్గా..  కొండాపూర్ అటవీ ప్రాంతంలో జింక ఎముకలను గుర్తించిన కొందరు గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది.. ఎముకలను ఫోరెన్స్ ల్యాబ్‌కు తరలించారు. 

రాజకీయ నేతలు తమ పలుకుబడిని ఉపయోగించి విషయం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పలువురు అనుమానితులను అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ