హైదరాబాదులో కరోనా తక్కువే: తెలంగాణలో లక్షా 45 వేలు దాటిన కేసులు

By telugu teamFirst Published Sep 8, 2020, 10:14 AM IST
Highlights

వరుసగా రెండో రోజు కూడా హైదరాబాదులో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తక్కువగానే నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చూస్తే కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మొత్తంగా లక్షా 45 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. హైదరాబాదులో తగ్గుముఖం పట్టినట్లు కనిపించినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా చూస్తే కరోనా వైరస్ వ్యాప్తి ఎప్పటిలాగే కొనసాగుతోంది. తాజాగా గత 24 గంటల్లో తెలంగాణలో 2392 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 45 వేల 163కు చేరుకుంది.

కాగా, తెలంగాణలో కరోనా వైరస్ కారణంగా గత 24 గంటల్లో 11 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 906కు చేరుకుంది. గత 24 గంటల్లో కరోనా వైరస్ నుంచి 2346 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. దీంతో ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయినవారి సంఖ్య తెలంగాణలో లక్షా 12 వేల 587కు చేరుకుంది. ఇంకా 31567 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

హైదరాబాదులో మరోసారి తక్కువ సంఖ్యలోనే కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో జిహెచ్ఎంసి పరిధిలో 304 కేసులు మాత్రమే నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 191 కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో జిల్లాలవారీగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది.

ఆదిలాబాద్ 33
భద్రాద్రి కొత్తగూడెం 95
జిహెచ్ఎంసీ 304
జగిత్యాల 64
జనగామ 38
జయశంకర్ భూపాలపల్లి 18
జోగులాంబ గద్వాల 22
కామారెడ్డి 76
కరీంనగర్ 157
ఖమ్మం 116
కొమరంభీమ్ ఆసిఫాబాద్ 20
మహబూబ్ నగర్ 45
మహబూబాబాద్ 71
మంచిర్యాల 69
మెదక్ 36
మేడ్చెల్ మల్కాజిగిరి 132
ములుగు 20
నాగర్ కర్నూలు 53
నల్లగొండ 105
నారాయణపేట 8
నిర్మల్ 34
నిజామాబాద్ 102
పెద్దపల్లి 68
రాజన్న సిరిసిల్ల 64
రంగారెడ్డి 191
సంగారెడ్డి 37
సిద్ధిపేట 89
సూర్యాపేట 101
వికారాబాద్ 15
వనపర్తి 40
వరంగల్ రూరల్ 21
వరంగల్ అర్బన్ 91
యాదాద్రి భువనగిరి 57
మొత్తం 2392

 

Media Bulletin on status of positive cases in Telangana. (Dated. 08.09.2020) pic.twitter.com/R2UdJ3DASv

— Dr G Srinivasa Rao (@drgsrao)
click me!